అండమాన్ జైలులో ఆనాడు బ్రిటీష్ వారు ఖైదీలను దారుణంగా హింసేవారని తెలియజెప్పుతున్న ప్రతిమలు
అగ్గిరాజును నిర్భందించిన అండమాన్ లోని సెల్యూలర్ జైలు. ఆయన అక్కడే చనిపోయాడని బ్రిటీష్ ప్రభుత్వం 1936లో ఎన్.జి. రంగా ప్రశ్నకు సమాధానంగా చెప్పింది
1924, మే 6వ తేదీన అల్లూరి శ్రీరామరాజు తదుపరి స్థానంలో ఉండే అతి ముఖ్యమైన తిరుగుబాటు నాయకుడు సూర్యనారాయణ రాజును (అగ్గిరాజు) పట్టుకొన్నట్టుగా మద్రాసు ప్రెసిడెన్సీ నివేదికలో బ్రిటీష్ ప్రభుత్వం పేర్కొంది . ఆ మరుసటి రోజునే శ్రీరామరాజునూ బంధించినట్టూ తెలిపింది
1936లో అగ్గిరాజు గురించి మద్రాసులోని శాసన మండలిలో ప్రశ్నించిన ఆచార్య ఎన్జీరంగా. ఆయన అడగటం వల్లనే అగ్గిరాజు చనిపోయాడన్న విషయం బయటపడింది
