అల్లూరిని హతమార్చిన కేడీ పేట వద్ద స్మారక చిహ్నం
పట్టుబడిన తర్వాత పారిపోతుండగా అల్లూరిని కాల్చివేసినట్టుగా 1924 నాటి మద్రాస్ ప్రెసిడెన్సి పరిపాలన నివేదికలో నాటి ప్రభుత్వం పేర్కొంది. అల్లూరి 1924, మే7వ తేదీన పట్టుపడ్డాడని వెల్లడించినప్పటికీ ఎప్పుడు పారిపోయే ప్రయత్నం చేసింది, ఎప్పుడు కాల్చివేసిందీ ఈ నివేదికలో తెలపలేదు. నివేదికలోని 145వ పేజీలోని 10వ లైను నుంచి కేవలం నాలుగు లైన్లలోనే ఆయన గురించి చెప్పి ఆయన మరణం తర్వాత గ్రామస్తులంతా తమకు సహకరిస్తూ వచ్చినట్టు రాసుకొన్నారు.
అల్లూరి జన్మించిన విశాఖ జిల్లా పాండ్రంగిలో నిర్మించిన స్మారక మందిరం గోడపై ఆయన జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఇలా వివరించారు.
