పైన పేర్కొన్న విధులన్నీ క్షేత్ర సహాయకులే చేయాలి
తెలంగాణ తొలి పీఆర్సీ 2020లో ఇచ్చిన నివేదికలో నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి నెలవారి కనీస ఖర్చును రూ.16,500గా అంచనా వేసి.. కరోనా నేపథ్యంలో దాన్ని రూ.19వేలకు పెంచి దాన్ని కనీస వేతనంగా సిఫార్సు చేసింది
పై ఫొటోలో వయస్సు మళ్లినవారు సైతం మట్టి పనులు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇటువంటి వారందరికీ గ్రామంలోనే ఉపాధిని కల్పించేది క్షేత్ర సహాయకులే
జీతాల్లో కోతవేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉద్యోగులు కోరటమే మహాపరాధంగా ప్రభుత్వం పరగణించింది. ఇటువంటి కారణంగానే ప్రస్తుతం జీతాల గురించి గట్టిగా అడగలేని పరిస్థితి నెలకొంది
